Coronavirus: భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా

Coronavirus: ఇవాల కొత్తగా మరో 56,211 మందికి పాజిటివ్ * ఇవాళ మరో 271 మంది మృతి

Update: 2021-03-30 04:31 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Coronavirus: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కొత్త వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. వరుసగా రెండు రోజుల పాటు 60వేలు దాటిన పాజిటివ్ కేసులు.. ఇవాళ కాస్త తగ్గింది. గడిచిన 24గంటల్లో 56 వేల 211 మందికి కరోనా సోకింది. అంతేకాదు కొవిడ్ బారిన పడి దేశవ్యాప్తంగా మరో 271 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య లక్షా 62వేలు దాటింది. దేశవ్యాప్తంగా 5లక్షల 40వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Tags:    

Similar News