దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు..

Update: 2020-05-29 16:24 GMT
Representational Image

దేశంలో కరోనా కేసుల 1 లక్ష 72 వేల 174 కు పెరిగింది. శుక్రవారం, మహారాష్ట్రలో గరిష్టంగా 116 మంది రోగులు మరణించారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 2682 కేసులు నమోదయ్యాయి. దీనితో పాజిటివ్ కేసులు 62 వేలు దాటాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రకు చెందిన 8381 మంది రోగులు కూడా కోలుకున్నారు. మరోవైపు ఢిల్లీలో 1106 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.. 82 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం సంఖ్య వరుసగా రెండవ రోజు వెయ్యికి పైగా పెరిగింది.

నేడు, దేశవ్యాప్తంగా 6822 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. గరిష్టంగా 10652 మంది కోలుకోగా, 245 మంది మరణించారు. ఇవే కాకుండా, తమిళనాడులో 874, గుజరాత్‌లో 372, పశ్చిమ బెంగాల్‌లో 277, కర్ణాటకలో 248, ఉత్తరాఖండ్‌లో 216, జమ్మూ కాశ్మీర్‌లో 128, రాజస్థాన్‌లో 91, బీహార్‌లో 90, ఒడిశాలో 63 మందికి కరోనా సోకింది.


Tags:    

Similar News