మహారాష్ట్రలో 786 మంది పోలీసులకు కరోనా..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది.. ఆదివారం 1943 సంక్రమణ కేసులు ఇక్కడ నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది.. ఆదివారం 1943 సంక్రమణ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఇది ఒక రోజులో అత్యధికం. ఇక మహారాష్ట్రలో మొత్తం 22171 మందికి కరోనా సోకింది.. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో 4199 మంది రోగులకు నయం కావడంతో రాష్టంలోని వివిధ ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు, మరణాల సంఖ్య 800 దాటింది. 786 మంది పోలీసులకు కరోనా సోకినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. వీరిలో 703 మంది చికిత్స పొందుతున్నారు. 76 మంది కోలుకున్నారు.. కోవిడ్ భారిన పది 7గురు మరణించారు.