దేశంలో 74 వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 74 వేల 243 కు పెరిగింది.

Update: 2020-05-13 02:54 GMT
Representational Image

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 74 వేల 243 కు పెరిగింది. మంగళవారం, మహారాష్ట్రలో 1026, తమిళనాడులో 716, ఢిల్లీలో 406, గుజరాత్‌లో 362, మధ్యప్రదేశ్‌లో 201, రాజస్థాన్‌లో 138, పి. బెంగాల్‌లో 110, బీహార్‌లో 81 సహా 3474 కి పైగా నివేదికలు పాజిటివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1871 మంది రోగులు కూడా కోలుకున్నారు. ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ఆధారంగా ఉన్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో 70 వేల 756 మంది కరోనా భారిన పడినట్లు తెలిపింది. ఇందులో 46 వేల 8 మంది చికిత్సలో ఉన్నారు. 22 వేల 454 మంది నయం అయింది, 2293 మంది రోగులు మరణించారు.

ఇదిలావుంటే తాజాగా మహారాష్ట్రలో 1026 కేసులు నమోదయ్యాయి. ఆర్థర్ రోడ్ జైలులో 100 మంది ఖైదీలు కరోనా పాజిటివ్ అని తేలిన తరువాత, రాష్ట్రంలోని 50% మంది ఖైదీలను టెంపరరీ బెయిల్ లేదా పెరోల్‌పై విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ కమిటీ నిర్ణయించింది. ఈ ఖైదీలను ఎంతకాలం పాటు బయట ఉంచాలో మాత్రం కమిటీ ఇంకా స్పష్టం చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో మొత్తం 35 వేల 239 మంది ఖైదీలు ఉన్నారు. 



 


Tags:    

Similar News