India Corona Cases: సెకండ్‌వేవ్‌ కల్లోలం..24 గంటల్లో వెయ్యికిపైగా మృతి

India Corona Cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది.

Update: 2021-04-14 05:40 GMT

కరోనా కేసులు(ఫైల్ ఫోటో)

India Corona Cases: భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రెండులక్షలకు చేరువలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా లక్షా 84వేల 372 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారినపడి, వెయ్యి 27 మంది మృతి చెందారు. దేశంలో ప్రసుత్తం 13లక్షల 65వేల 704 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసులు కోటి 38లక్షల 73వేల 825కు చేరాయి. కోవిడ్ తో దేశంలో ఇప్పటి వరకు మొత్తం లక్షా 72వేల 85మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 82వేల 339 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News