దేశంలోనే మొదటిసారి : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ గర్భిణి
కరోనా వైరస్ బారిన పడిన ఓ గర్భిణి ఈ రోజు పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
కరోనా వైరస్ బారిన పడిన ఓ గర్భిణి ఈ రోజు పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ తల్లికి మొదటి శిశువు ఇదే కావడం విశేషం.. ప్రస్తుతం తల్లి మరియు బిడ్డను ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఇప్పటివరకు, తల్లి పాలివ్వడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని రుజువు లేదు కాబట్టి శిశును తల్లితోనే ఉంచారు. ఢిల్లీ ఎయిమ్స్లో పని చేస్తున్న రెసిడెంట్ డాక్టర్తో పాటు ఆమె భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమె భార్య నిండు గర్భిణి.. అయితే శుక్రవారం రాత్రి ఆమెకి పురిటినొప్పులు వచ్చాయి.
అనంతరం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. ఓ కరోనా పేషెంట్ బిడ్డకు జన్మనివ్వడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. గత 24 గంటల్లో దేశంలో అత్యధిక కేసులు (601), మరణాలు (12) నమోదవుతున్నందున, నవల కరోనావైరస్ లేదా కోవిడ్ -19 బారిన పడి భారతదేశంలో అరవై ఎనిమిది మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులు మొత్తం 2,902 కు చేరుకున్నాయి.