Omicron in Chennai: చెన్నైలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్ నైజిరియా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ బాధితుడి బంధువులకు సైతం పాజిటివ్‌

Update: 2021-12-16 05:16 GMT

చెన్నైలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు(ఫైల్ ఫోటో)

Omicron in Chennai: తెలంగాణలో అడుగుపెట్టిన ఒమిక్రాన్‌.. చెన్నైలో కూడా ఖాతా తెరిచింది.. విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి పాజిటివ్‌ అని తేలింది. అందులో నైజిరియా నుంచి చెన్నైకి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ కన్ఫామ్‌ అయ్యింది. ఆయనతో పాటు వచ్చిన బంధువుల్లో అయిదుగురికి కూడా కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. వారి శాంపిల్స్‌ను కూడా జినోమ్‌ సిక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపించారు. తమిళనాడులోకి ఒమిక్రాన్‌ అడుగుపెట్టడంతో అక్కడి వైద్యాధికారులు అలెర్ట్ అయ్యారు. ప్రజలందరూ కోవిడ్‌ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.   

Tags:    

Similar News