Corona: ఏవోబీలో మావోయిస్టులను వెంటాడుతున్న కరోనా

Corona: విశాఖ జిల్లా పోలీసులకు నిఘా వర్గాల సమాచారం * గాలికొండ, కోరుకొండ, పెదబయలు..

Update: 2021-05-11 07:49 GMT

మావోయిస్టులకు కరోనా (ఫైల్ ఇమేజ్)

Corona: ఏవోబీలో మావోయిస్టులను కరోనా టెన్షన్‌ పెడుతోంది. విశాఖ జిల్లా పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. గాలికొండ, కోరుకొండ, పెదబయలు కటాఫ్‌ ఏరియా దళాలలో సభ్యులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం అందినట్లు సమాచారం. కరోనా సోకిన మావోయిస్టులకు వైద్యం అందించడానికి సిద్దంగా ఉన్నామని జిల్లా పోలీసులు ప్రకటించారు. కరోనా లక్షణాలు ఉన్న వారు తమకు దగ్గరలో ఉన్న పీఎస్‌లో సమాచారం ఇవ్వాలని.. కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు ఎటువంటి భయాందోళనకు గురికావొద్దన్నారు.

Tags:    

Similar News