భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Corona cases: *ఇవాళ కొత్తగా 8,822 కరోనా కేసులు నమోదు

Update: 2022-06-15 07:28 GMT

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Corona cases: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరోసారి 8వేలకు పైగా కేసులు రాగా ముందు రోజు కంటే 33 శాతం అధికంగా నమోదయ్యాయి. మంగళవారం 4.40 లక్షల మందికి కరోనా టెస్ట్‌లు చేయగా 8వేల 822 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 2వేల956, కేరళలో 1,986, ఢిల్లీలో 1,118 మందికి కరోనా సోకింది. హర్యానా, కర్ణాటకతో పాటు సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తోంది. దీంతో యాక్టివ్ కేసులు 53వేల, 637కి చేరాయి. ఇక గడిచిన 24 గంటలో 5వేల, 718 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొవిడ్ కారణంగా నిన్న 15 మంది మరణించగా మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Tags:    

Similar News