పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్‌సింగ్ చన్నీ

* పంజాబ్ సీఎంగా ఎస్సీ నేతకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ * ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కాంగ్రెస్ నేత హరీశ్ రావత్

Update: 2021-09-19 13:01 GMT

పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్‌సింగ్ చన్నీ (ఫైల్ ఫోటో)

Charanjit Channi: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌సింగ్ చిన్నీని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అంతకుముందు సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌ధావా పేరును ప్రకటించినా సిద్ధూ అడ్డుపడినట్లు తెలుస్తోంది. సిద్ధూ వర్గం పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా దళిత నేతనే ఎన్నుకోవాలని డిమాండ్ చేయడంతో అధిష్టానం వెనక్కు తగ్గక తప్పలేదు. దీంతో సుదీర్ఘ చర్చల అనంతరం ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్న చరణ్‌జిత్‌సింగ్ చన్నీని పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించింది.

Tags:    

Similar News