చిదంబరంకు సుప్రీంకోర్టులో స్పల్ప ఊరట

Update: 2019-09-02 10:14 GMT

కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు సుప్రీంకోర్టులో స్పల్ప ఊరట లభించింది. ఆయనను సిబిఐ కస్టడీకి ఇవ్వొద్దని ట్రయల్ కోర్టును ఆదేశించింది. అలాగే ఆయన బెయిల్ పిటిషన్ ను పరిశీలించాలని చెప్పింది. చిదంబరంను తీహార్ జైలుకు తరలించొద్దని ట్రయల్ కోర్టును ఆదేశించింది. కాగా ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో గతనెల 21న చిదంబరాన్ని సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కస్టడీకి గడువు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరితే తొలుత 5 రోజులు .. తర్వాత మరో 4 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News