చత్తీస్ఘడ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజ్నంద్గావ్ జిల్లాలో రిజర్వ్ గార్డ్ పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. బగ్నంది పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే సితాగోటా అడవిలో ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.