సుందరమైన ప్రదేశం కాదు.. ఏంటో తెలుసా?

సుందరమైన ప్రదేశం చూట్టు తెల్లటి ముంచుతో కప్పడబడిన స్థలం, సంప్రదాయ వస్ర్రాల ధరించిన స్త్రీలు ఈ ఫోటో చూస్తే ఆ స్థాలానికి ఒక్కసారైనా వెళ్లాలి అనిపిస్తుంది కదూ.

Update: 2019-11-04 10:11 GMT
Chhath puja

సుందరమైన ప్రదేశం చూట్టు తెల్లటి ముంచుతో కప్పడబడిన స్థలం, సంప్రదాయ వస్ర్రాల ధరించిన స్త్రీలు ఈ ఫోటో చూస్తే ఆ స్థాలానికి ఒక్కసారైనా వెళ్లాలి అనిపిస్తుంది కదూ. అందరూ అనుకున్నట్లు ఆది సుందరమైన ప్రదేశం కాదు, అక్కడ ఉంది ముంచు కాదు. కాలూష్యం కోరల్లో చిక్కుకున్న యుమునా నది ప్రాంతం. ఛత్ పూజలు అనగానే గుర్తుకు వచ్చేది ఉత్తర భారతం, అక్కడి వారు ఎక్కువగా ఈ పూజా సంప్రదాయాలను జరుపుకుంటారు. వారు తెల్లవారే వరకు పూజలు చేసి, సూర్యోదం కాగానే సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పిస్తారు.

కాగా..ఛత్ పూజలో భాగంగా యమునా నది తీరంలో భానుడికి అక్కడి మహిళలు పూజలు నిర్వహించారు. ఢిల్లీ దగ్గరలోని కుంజ్ ప్రాంతంలో కనిపించిన కొన్ని చిత్రాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విషపు రసాయనాలతో నురగ మధ్యలోనే యమునా నదిలో కొందరు మహిళలు పూజలు చేశారు. రసాయనాలతో కూడిన నురగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అనే అవగహాన లేకపోవడంతో ఆ నీటిలో మహిళలు పూజలు చేశారు. మహిళలు పూజలు నిర్వహిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రభుత్వం వాహనాల నియంత్రనకు సరి బేసి విధానాన్ని కూడా అమలు చేసింది.  

Tags:    

Similar News