మీ ముత్తాతను అడుగు: రాహుల్‌కు కేంద్రమంత్రి కౌంటర్‌

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

Update: 2021-02-12 16:26 GMT

కిషన్ రెడ్డి ఫైల్ ఫోటో 

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. చైనాకు భార‌త భూభాగాన్ని ఎవ‌రు అప్ప‌గించార‌న్న విష‌యాన్ని మీ ముత్తాత‌ను‌ (జవహర్‌ లాల్‌ నెహ్రూ)ను అడిగితే స‌మాధానం త‌ప్ప‌కుండా తెలుస్తుంద‌ని చుర‌క‌లంటించారు. దేశ‌భ‌క్తి ఎవ‌రికి ఉందో, ఎవ‌రికి లేదో భార‌త‌ ప్ర‌జ‌ల‌కు తెలుసని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్ధం కాదని ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News