'రికవరీ రేటు మన దేశంలో చాలా బాగుంది' : కేంద్రం

Update: 2020-04-24 10:24 GMT

దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. 23,000 మందికి పైగా కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తన వెబ్ సైట్ లో పేర్కొంది. సోకిన వారిలో 700 మందికి పైగా మరణించారు.. భారత్ లో ఇది భయంకరమైన సంఖ్యగా కనిపించవచ్చు కానీ వ్యాప్తి చెందుతున్న ఇతర పెద్ద దేశాలలో మరణాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ సంఖ్య. కరోనా బారినపడ్డ వారిలో మిగతా దేశాలతో పోలిస్తే రికవరీ రేటు మన దేశంలో బాగుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ హర్ష వర్దన్‌ వెల్లడించారు. భారత్ లో మొత్తం 4748 మంది రికవరీ ఆయ్యారు. దీంతో ప్రస్తుతం 17,610 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 

Tags:    

Similar News