రోజుకు 8 పని సమయాన్నిఇక నుంచి 9 గంటల వరకూ మారున్నాయి.అందుకుగాను కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల వర్తించే పని దినాన్ని తొమ్మిద గంటలకు మార్చే క్రమంలో కొత్త నిబంధనలు జారీ చేసింది. దేశంలో ఇప్పటికే పలు పరిశ్రమల్లో ఏనిమిది గంటల పని సమయం 9 గంటలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనను డ్రాఫ్ట్ మేజ్ రూల్స్లో తీసుకొచ్చింది. పని సమయం గురించి ప్రస్తావించిన కేంద్రం కనీస వేతనం గురించి మాత్ర ఆ నిబంధనల్లో పేర్కొనలేదు. వేతనాలు నిర్ణయించడానికి ఆరు ప్రమాణాలకు సూచించింది. ఇక మిగతావి పాత నిబంధనలనే పొందుపరిచింది.
అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మికులు, ఉద్యోగస్తులు అభిప్రాయాలను నవంబర్ 30లోగా తెలపాలని rajiv.ranja76@gov.in, malick.bikash@gov.in అనే ఈ మెయిల్స్ చేయాలని తెలిపింది. ఉద్యోగుల అభిప్రాయాలు పరిగణంలోకి తీసుకొని పని సమయం మార్పు అంశంపై ప్రకటణ చేస్తామని తెలిపింది. అయితే జీతభత్యాల గురించి కేంద్రం ప్రస్తావించకపోవడంపై ఉద్యోగస్తుల వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి.