CAA: సీఏఏ రూల్స్‌ను ఇవాళ నోటిఫై చేయ‌నున్న కేంద్ర స‌ర్కారు..!

CAA: సీఏఏను అమల్లోకి తెస్తూ నిబంధనల ప్రకటించిన కేంద్రం

Update: 2024-03-11 13:11 GMT

CAA: సీఏఏ రూల్స్‌ను ఇవాళ నోటిఫై చేయ‌నున్న కేంద్ర స‌ర్కారు..!

CAA: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై విధివిధానాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టం-2019ను అమల్లోకి తెస్తూ నిబంధనల్ని ప్రకటించింది కేంద్రం. ఈ చట్టం విధివిధానాలు, అమలు నిబంధనలను కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది.

సార్వత్రిక ఎన్నికల ముందు సీఏఏను అమలు చేస్తామన్న బీజేపీ, ఆ విధంగానే నోటిఫికేషన్​ ప్రకటనకు ముందే సీఏఏను అమల్లోకి తెచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందిస్తోంది.

2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. సీఏఏ చట్టం 2019 డిసెంబరులో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. నిబంధనలు లేకపోవడం వల్ల ఇంతవరకు ఈ చట్టం అమల్లోకి రాలేదు.

Tags:    

Similar News