అయోధ్య వివాదంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

Update: 2019-09-18 09:02 GMT

అయోధ్య రామ జన్మభూమి రోజువారీ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌ 18 లోపు వాదనలు పూర్తి చేస్తామని సీజేఐ స్పష్టం చేశారు. ఆ లోపే తీర్పును కూడా రిజర్వ్‌ చేస్తామని తెలిపారు. పిటీషనర్లు కోరితే మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. మరోవైపు నవంబర్‌ 17 న సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఆ లోపే అయోధ్య వివాదానికి సంబంధించి తుది తీర్పు వెల్లడిస్తారని తెలుస్తోంది.  

Tags:    

Similar News