రామజన్మభూమి,బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై సుప్రీంకోర్టు మరికాసేపట్లో విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. స్థల వివాద పరిష్కారానికి ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వం వల్ల ఎలాంటి పురోగతి కనిపంచకపోవడంతో సత్వరం విచారించాలంటూ ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారత్ కోర్టును కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ధర్మాసనం విచారణకు అవసరమైన అప్లికేషన్ను సమర్పించాలని సూచించింది.