ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్ధి పై కాల్పులు
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిపై గుర్తు తెలియని దుండగులు తుపాకులతో దాడికి పాల్పడిన సంఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటు చేసుంది.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిపై గుర్తు తెలియని దుండగులు తుపాకులతో దాడికి పాల్పడిన సంఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటు చేసుంది.వివరాల్లోకెలితే కాంగ్రెస్ మిత్రపక్షమైన స్వాభిమాని పక్ష పార్టీకి చెందిన దేవేంద్ర భుయార్ తాజా ఎన్నికల్లో మోర్షి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
భుయార్ సోమవారం తెల్లవారుజామున తన కార్యకర్తలతో కలిసి కారులో వెళ్తుండగా బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు వాహనాన్ని అడ్డగించి, అతనిని బయటకు లాగి ఆయనపై దాడి చేశారు. దాంతో ఆగకుండా అతని వాహనానికి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడిన భుయార్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు, అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చెసుకుని దర్యాప్తు చేస్తున్నారు.