అసోంలో పౌరుల తుది జాబితా విడుదల
అసోంలో జాతీయ జనాభా తుది బాబితా విడుదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాబితాలో లేని వారి పేర్లు మాత్రమే ఆన్లైన్లో పొందుపరిచారు. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు.
అసోంలో జాతీయ జనాభా తుది బాబితా విడుదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాబితాలో లేని వారి పేర్లు మాత్రమే ఆన్లైన్లో పొందుపరిచారు. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. తుది జాబితాలో 3కోట్ల 11 లక్షల 21వేల మందికి చోటు కల్పించారు. దీంతో అసోం వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 200 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. ఎన్ఆర్సి జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం ఉంటుందని వారు విదేశీయుల ట్రైబ్యునల్కు అప్పీలు చేసుకోవచ్చని వెల్లడించారు. విదేశీయుల జాబితాలో ఎక్కువ మంది ముస్లింలు, అందులో బెంగాళీ మాట్లాడే ముస్లింలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.