Delhi Liqour Scam: నేటితో ముగిసిన అరుణ్ పిళ్ళై ఈడీ కస్టడీ

Delhi Liqour Scam: అరుణ్ పిళ్లైని కోర్టులో హాజరుపరిచిన ఈడీ

Update: 2023-03-13 09:14 GMT

Delhi Liqour Scam: నేటితో ముగిసిన అరుణ్ పిళ్ళై ఈడీ కస్టడీ

Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొనసాగుతోంది. ఇవాళ్టితో అరుణ్ పిళ్ళై ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అరుణ్ పిళ్లైని ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. మరో మూడు రోజుల పాటు పిళ్ళై కస్టడీ పొడిగించాలని కోరారు. మనీలాండరింగ్ ముడుపుల వ్యవహారాలకి సంబంధించి.. సౌత్ గ్రూప్‌లోని వ్యక్తులను ప్రశ్నించాల్సి ఉందని.. మార్చి 9న బుచ్చిబాబును విచారణకు రావాలని కోరామని తెలిపారు. ఇక బుచ్చిబాబు మార్చి 13 వరకు సమయం కోరారని.. బుచ్చిబాబుతో కలిపి పిళ్ళైని విచారించాల్సి ఉందన్నారు. పిళ్ళై కస్టడీని మార్చి 15 వరకు పొడిగించాలని కోరారు ఈడీ అధికారులు.

Tags:    

Similar News