ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి మరో అరుదైన గౌరవం

Update: 2019-09-02 11:45 GMT

ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఈనెల ఆఖరున అమెరికాలో అవార్డును అందుకోనున్నారు. ఐదేళ్ల కిందట మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమానికి గాను ఈ అవార్డు దక్కింది. నెలాఖరున బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రదానం చేయనుంది. కాగా అవార్డు రావడంపై పీఎంవో సహాయమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ప్రధాని త్వరలో అమెరికాలో పర్యటిస్తారని.. ఆ సందర్బంగా ఈ అవార్డును అందుకుంటారని అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అపురూప ఘట్టమని ఆయన వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News