త్వరలోనే వసంతం తిరిగివస్తుంది : అమృత ఫడ్నవీస్‌

అసెంబ్లీలో బలపరీక్షకు ముందే మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్గం సుమగమైంది.

Update: 2019-11-27 05:49 GMT
Amruta Fadnavis File Photo

అసెంబ్లీలో బలపరీక్షకు ముందే మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత రెండు గంటల్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్గం సుమగమైంది.

ఈ నేపధ్యంలో బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కాగా, మాజీ సీఎం ఫడ్నవీస్‌ భార్య అమృత ఫడ్నవీస్‌ ట్వీటర్ లో ఓ కవిత్వాన్ని పోస్టు చేశారు. మళ్లీ వసంతం తిరిగివస్తుందని,కొమ్మలపై పరిమళం విచ్చుకుంటుంది, శరధ్రుతువని మార్పు కోసం ఎదరుచూస్తామని అమృత ఫడ్నవీస్‌ ట్వీట్‌ చేశారు. మహారా‌ష్ట్ర ప్రజలకు ధన్యవాదాలని, మీప్రేమ ఎప్పటికి గుర్తుంటుందని తెలిపారు.

Tags:    

Similar News