త్వరలోనే వసంతం తిరిగివస్తుంది : అమృత ఫడ్నవీస్
అసెంబ్లీలో బలపరీక్షకు ముందే మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం మార్గం సుమగమైంది.
అసెంబ్లీలో బలపరీక్షకు ముందే మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత రెండు గంటల్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం మార్గం సుమగమైంది.
ఈ నేపధ్యంలో బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కాగా, మాజీ సీఎం ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ట్వీటర్ లో ఓ కవిత్వాన్ని పోస్టు చేశారు. మళ్లీ వసంతం తిరిగివస్తుందని,కొమ్మలపై పరిమళం విచ్చుకుంటుంది, శరధ్రుతువని మార్పు కోసం ఎదరుచూస్తామని అమృత ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలని, మీప్రేమ ఎప్పటికి గుర్తుంటుందని తెలిపారు.
पलट के आऊंगी शाखों पे खुशबुएँ लेकर,
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) November 26, 2019
खिज़ां की ज़द में हूँ मौसम ज़रा बदलने दे! Thanks Mah for memorable 5yrs as your वहिनी !The love showered by you will always make me nostalgic! I tried to perform my role to best of my abilities-with desire only to serve & make a positive diff🙏 pic.twitter.com/ePUzQgR9o5