All Party Meeting: రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నివాసంలో అఖిలపక్ష సమావేశం

All Party Meeting: ఏపీలో ఆర్థిక, శాంతి భద్రత, నీటి అంశాలపై సభలో చర్చిస్తాం -కనకమేడల

Update: 2021-07-18 05:49 GMT

వెంకయ్య నాయుడు (ఫైల్ ఇమేజ్)

All Party Meeting: ఏపీలో ఆర్థిక, శాంతి భద్రతలు, నీటి అంశాలన్నీ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని అన్నారు రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ కనకమేడల. ఏపీలో జీతాలు చెల్లించలేని ఆర్థిక దుస్థితి నెలకొందని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. నీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో పోరాటం చేయలేక కేంద్రానికి లేఖ రాసి గెజిట్‌ తమ క్రెడిట్‌గా చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కనకమేడల ప్రజా సమస్యలపై చర్చించేందుకు సంఖ్యా బలంతో సంబంధం లేకుండా తగినంత సమయం కేటాయించాలని కోరారు. 

Tags:    

Similar News