అయోధ్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హిందూ, ముస్లిం మత పెద్దలతో ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమామేశమయ్యారు. ఈ కేసు తీర్పు వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘనలు జరకుండా రెండు వర్గాలు సంయమనం పాటించాయని దోవల్ ప్రశంసించారు. సర్వోన్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతించడంతోపాటుగా భవిష్యత్లోనూ సామరస్యంగా వ్యవహరించాలన్నా. ఈ సమావేశానికి యోగా గురు బాబా రాందేవ్, స్వామి చిదానంద్ సరస్వతి, స్వామి పరమాత్మానంద్, షియా క్లరిక్ మౌలానా కల్బేజవాద్ అవదేశానంద మహరాజ్తోపాటు పలువురు ఈ భేటీలో పాల్గొన్నారు.
భారతదేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య వివాదాస్పద భూమి రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీకోర్టు శనివారం కీలక తీర్పు వెల్లడించింది. 40 రోజుల పాటు వరుసగా విచారణ చేసిన రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఆలయ నిర్మాణం కోసం 3 నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయోధ్యలోనే బాబ్రీ మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని విషయం తెలిసిందే.