ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. లాస్ట్ మినిట్ టికెట్లపై భారీ డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన వాణిజ్య సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఇది కేవలం లోకల్(దేశీయ) ప్రయాణికులకు మాత్రమనేనని స్పష్టం చేసింది. సాధారణంగా ఆఖరి నిమిషంలో టిక్కెట్ బుక్ చేసుకున్నవారికి 40 శాతం అధికంగా రేట్లు ఉంటాయి.
కానీ జెట్ ఎయిర్ వేస్ సంక్షోభం, పలు విమానాల రద్దు వంటి పరిణామాలతో ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి అందుబాటులో ఉన్న సీట్లలో లాస్ట్ మినిట్ బుకింగ్లపై 50శాతం తగ్గింపును వర్తింప జేయనుంది. లాస్ట్ మినిట్ బుకింగ్లపై 50శాతం తగ్గింపును వర్తింప జేయనుంది. అన్ని బుకింగ్ యాప్ , వెబ్సైట్ లలో ఈ సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది ఎయిరిండియా సంస్థ.