శీతాకాల సమావేశాల తొలిరోజే విపక్షాల రచ్చ.. సాగు చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టిన వ్యవసాయశాఖ మంత్రి

* మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం * మూజువాణితో ఓటుతో బిల్లును ఆమోదించిన లోక్‌సభ

Update: 2021-11-29 08:03 GMT

సాగు చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టిన వ్యవసాయశాఖ మంత్రి తోమర్ (ఫైల్ ఫోటో)

Lok Sabha: శీతాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజే లోక్‌సభలో విపక్షాలు రచ్చకు దిగాయి. లోక్‌సభ ముందుకు సాగు చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టారు వ్యవసాయశాఖ మంత్రి తోమర్. మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

మూజువాణితో ఓటుతో బిల్లును ఆమోదించిన లోక్‌సభ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే విపక్షాలు ఆందోళనలు విరమించకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. 

Tags:    

Similar News