Coronavirus Updates in India: భారత్‌లో కొత్త‌గా 47,905 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-11-12 04:37 GMT

India: భారత్‌లో‌ కరోనా కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దేశంలో కేసుల సంఖ్య 86 లక్షల 83 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 47,905 కేసులు నమోదు కాగా, 550 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 52,718 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 86,83,917 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,89,294 ఉండగా, 80,66,501 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,28,121 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 92.89 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.48 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 5.63 శాతంగా ఉంది.

Tags:    

Similar News