Corona Cases in India: భారత్ లో గ‌డిచిన 24గంట‌ల్లో 44,658 క‌రోనా కేసులు

Update: 2021-08-27 06:45 GMT

Representation Photo

Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 44,658 క‌రోనా పాజిటివ్ కేసులు కొత్తగా న‌మోదు అయ్యాయి. మ‌రో వైపు క‌రోనా వ‌ల్ల 496 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైర‌స్ సోకిన వారిలో సుమారు 32 వేల మంది నిన్న కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా ఇప్పటి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,36, 861గా ఉంది. అయితే 24 గంట‌ల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు కేర‌ళ‌లో న‌మోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 30 వేల కేసులు వ‌చ్చాయి. 162 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం 3లక్షల, 44,899 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags:    

Similar News