భారత్‌లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. మరణాలు...

Coronavirus Live Updates: గడిచిన 24 గంటల్లో కరోనాతో 44 మంది మృతి...

Update: 2022-04-24 07:00 GMT

భారత్‌లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. మరణాలు...

Coronavirus Live Updates: దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కొత్తగా 2వేల593 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు 4 కోట్ల, 30లక్షల, 57వేల, 545కు చేరాయి. మరో 15,873 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 44 మంది మహమ్మారి వల్ల మరణించగా, 1755 మంది కోలుకున్నారు.

ఇక మొత్తం కేసులల్లో యాక్టివ్‌ కేసులు 0.04 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.75 శాతం ఉందని, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని, రోజువారీ పాటివిటీ రేటు 0.546 శాతానికి పెరిగిందని తెలిపింది.

Tags:    

Similar News