Omicron Cases in India: చాపకింద నీరులా ఒమిక్రాన్‌.. 213 కి చేరిన బాధితుల సంఖ్య

Omicron Cases in India: వీరిలో 90 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు...

Update: 2021-12-22 05:43 GMT

Omicron Cases in India: చాపకింద నీరులా ఒమిక్రాన్‌.. 213 కి చేరిన బాధితుల సంఖ్య

Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వేరియంట్‌ బాధితుల సంఖ్య 213కి చేరుకుంది. వీరిలో 90 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొద్దికాలంగా స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా 6వేల 317 మంది కరోనా బారిన పడ్డారు.

ఢిల్లీలో 57 మంది ఒమిక్రాన్‌తో బాదపడుతుండగా మహారాష్ట్రలో 54 మంది, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15 మంది సఫర్‌ అవుతున్నారు. గుజరాత్‌లో 14 మందికి ఒమిక్రాన్‌ సోకింది.

Tags:    

Similar News