సిద్ధరామయ్యపై మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Update: 2019-08-23 06:49 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడానికి కారణం మాజీ సీఎం సిద్దరామయ్య అంటూ వ్యాఖ్యానించారు. సీఎంగా కుమారస్వామి ఉండటం సిద్ధరామయ్యకు ఇష్టం లేదని, మైసూరు జిల్లా చాముండేశ్వరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి జేడీఎస్‌ నేత జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోవడంతో సిద్ధరామయ్య జీర్ణించుకోలేక పోయారన్నారు. అది తట్టుకోలేక కుమారస్వామి ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపీతో కలిసి కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆయన బీజేపీతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరూ సిద్ధరామయ్య మద్దతుదారులే అన్నారు. ఇప్పటికైనా సిద్ధరామయ్య వైఖరిని కాంగ్రెస్‌ గమనించాలని కోరారు. 

Tags:    

Similar News