ఆర్టికల్ 370 రద్దుపై మోదీ కీలక వ్యాఖ్యలు

ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ స్వతంత్య్రం అని ప్రధాని మోడీ అన్నారు. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన తరువాత దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2019-08-15 03:12 GMT

ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ స్వతంత్య్రం అని ప్రధాని మోడీ అన్నారు. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన తరువాత దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ...స్వాతంత్య్రం అనంతరం శాంతి, సమృద్ధి, భద్రతకు అందరూ కృషి చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకే ఆర్టికల్‌ 370ని రద్దు చేశామన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ కలని సాకారం చేశామని మోదీ పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై కొందరు రాజకీయ రాద్ధాంతం చేశారని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌, లఢక్‌ ప్రజలు ఆర్టికల్‌ 370, 35(ఏ) రద్దును స్వాగతించారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లభించింది. జమ్ము కశ్మీర్‌లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కాయి. గత ప్రభుత్వాలు ఆర్టికల్‌ 370పై ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.  

Tags:    

Similar News