త్వరలోనే క్లారిటీ ఇస్తా : రజినీకాంత్

మరోసారి సస్పెన్స్ గానే మిగిలింది రజినీకాంత్ పొలిటికల్ వ్యవహారం. మక్కల్ మండ్రం పార్టీ నేతలతో ఇవాళ సమావేశమైయ్యరు తలైవా. జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ అయ్యారు.

Update: 2020-11-30 08:53 GMT

మరోసారి సస్పెన్స్ గానే మిగిలింది రజినీకాంత్ పొలిటికల్ వ్యవహారం. మక్కల్ మండ్రం పార్టీ నేతలతో ఇవాళ సమావేశమైయ్యరు తలైవా. జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ అయ్యారు. అయితే సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రజినీ త్వరలోనే తన నిర్ణయం ఏంటో చేబుతానని వెల్లడించారు. తానూ ఎవరికీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా కూడా వారు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని రజినీకాంత్ వెల్లడించారు. ఈ భేటిలో వారి తరుపునుంచి లోటుపాట్లను నాకు తెలిపారని, నా అభిప్రాయాలను కూడా వారితో పంచుకున్నట్టుగా రజినీ వెల్లడించారు.

అనంతరం రాఘవేంద్ర హాల్ బ‌య‌ట ఉన్ త‌న మద్దతుదారులను పలకరించారు ర‌జ‌నీకాంత్. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని, తన పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ఆ పదవికి ఉత్తమ అర్హత కలిగిన వ్యక్తిని నామినేట్ చేస్తానని రజినీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అటు 2021 ఏప్రిల్-మే నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు రజినీకాంత్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న అన్నాత్తే అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో మొద‌లు కానుంది. 

Tags:    

Similar News