చిరంజీవి సినిమా నుంచి త్రిష ఔట్

టాలీవుడ్ అగ్రకథనాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’.

Update: 2020-03-13 16:44 GMT
chiranjeevi, trisha File Photo

టాలీవుడ్ అగ్రకథనాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి తాజా వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిషను తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి త్రిష వైదొలిగినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ ట్విట్ చేశారు. కొన్ని విషయాలు మొదట చెప్పినట్లు, చర్చించుకున్నట్లు భిన్నంగా మారుతుంటాయి. క్రియేటివ్‌ అంశంలో భిన్నాభిప్రాయాల వల్ల చిరంజీవి గారి చిత్రంలో నటించకూడదని అనుకున్నా. సినిమా యూనిట్‌కు నా అభినందనలు. తెలుగు ప్రేక్షకులను మరొక మంచి ప్రాజెక్టుతో కలుస్తానని ఆశిస్తున్నా' అని త్రిష ట్విట్ చేశారు.

గతంలో చిరంజీవి, త్రిష కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. అప్పట్లో వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా మంచి విజయం అందుకుంది. చాలా కాలం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కానీ త్రిష ఈ సినిమా నుంచి అర్థంతరంగా తప్పుకున్నారు. త్రిష ప్రస్తుతం తమిళంలో 'పరమపదం విలయాట్టు', 'రాంగీ',పలు చిత్రాల పాజెక్టులు ఉన్నాయి. మరో సారి చిరు - త్రిష జోడిని వెండితెరపై చూడబోతుండటంతో సంతోషం ఆవిరైనట్లే

 


Tags:    

Similar News