చిరంజీవి, బాలకృష్ణల మధ్యలో విబేధాలు లేవు: త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ

Update: 2020-05-30 08:27 GMT
Thammareddy Bharadwaja (File Photo)

కరోనా సమయంలో లాక్ డౌన్ కారణం గా చిత్ర పరిశ్రమ చాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పరిశ్రమను నమ్ముకున్న కార్మికులు థియేటర్స్ మీద ఆధారపడ్డ వేలమంది రోడ్డున పడ్డారు. ఈ తరుణంలోటాలీవుడ్ పెద్దలు పరిశ్రమను గాడిలో పెట్టేందుకు, షూటింగ్స్ ని తిరిగి స్టార్ట్ చేసేందుకు తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చలు జరిపారు. ఆ తర్వాత సీఎంతో సమావేశమయ్యారు.

ఇప్పటి వరకు నాలుగుసార్లు హీరోలు, దర్శక నిర్మాతలు సమావేశాలు నిర్వహించారు. చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశాలకు నందమూరి బాలకృష్ణతో పాటు మరికొందరు హీరోలను పిలువలేదు. తెలుగు ఫిలిం ఛాంబర్ ను వదిలి ప్రయివేట్ మీటింగ్స్ నిర్వహించడంపై కొందరు సినీ పెద్దలు తప్పుపడుతున్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడరాదని హెచ్చరించారు. ఇండస్ట్రీ లో మీరేమి కింగ్ కాదు.. మీరు ఓ హీరో అంతే.. మీరు మాట్లాడితే మాట్లాడటానికి చాలామంది రెడీగా ఉన్నారన్నారు. ఇండస్ట్రీలో ఎవరూ రియల్ వ్యాపారం చేయడంలేదని, ఏపీకి వెళ్లే ఎవరి లెవల్ ఏమిటో తెలుస్తుందన్నారు. సమావేశాల పేరిట భూములు పంచుకుంటున్నారేమో అన్న బాలకృష‌్ణ వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ఘాటుగా రియాక్ట్ అవ్వటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయం పై నిర్మాత తమ్మారెడ్డి భార్యాత్వజ స్పందిస్తూ.. నటులు నాగబాబు, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. అయితే బాలకృష్ణ చేయని వ్యాఖ్యలను చేసినట్లు చూపుతున్నారని.. అలాగే అయన వ్యక్తిగత వ్యాఖ్యల గురించి స్పందించనని అన్నారు. చిత్ర పరిశ్రమలో నటులు చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని, వారిద్దరూ మంచి మిత్రులుగా ఉన్నారాని అన్నారు. వారితో చర్చలు జరిపినట్లు.. ఈ సమస్య ఇక్కడితో పరిష్కారం అయింది అని అనుకుంటున్నట్లు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. 


Tags:    

Similar News