పవర్ స్టార్ తో జత కట్టనున్న దేవసేన.. సంబరాల్లో ఫ్యాన్స్
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో షూటింగ్స్ లేక సినీతారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో షూటింగ్స్ లేక సినీతారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ అవకాశాన్ని దర్శకులు ఉపయోగించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు కొత్త సినిమా స్క్రిప్ట్ చెప్పి ఆయనను ఒప్పించేందుకు క్యూ కడుతున్నారు. అంతకుముందు వరుస సినిమాలు చేయాలని అనుకున్నా పవన్.. కరోనా ప్రభావం, లాక్ డౌన్ లేకపోతే వకీల్ సాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. పప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్నా విషయం తెలిసిందే.
ఈ చిత్రంతో పాటు క్రిష్ దర్సకత్వంలో రాబిన్ హుడ్ కాన్సెప్ట్తో హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోహినూర్ వజ్రం నేపథ్యంలో తెరకెక్కుతుందని నాగబాబు హింట్ కూడా ఇచ్చాడు. ఇక ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్కను ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు ఈ సినిమాలో కథానాయక పాత్రకు బాలీవుడ్ భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్ను తీసుకున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దాని కోసం జాక్వలైన్ హైదరాబాద్ వచ్చి క్రిష్ను కూడా కలిసిందనే వార్తలొచ్చాయి.
మరి ఇప్పుడు జాక్వలైన్ స్థానంలోనే అనుష్కను తీసుకున్నారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. టాలీవుడ్ వర్గాలు మాత్రం పవన్ సరసన అనుష్క నటించటం కన్ఫర్మ్ అని అంటున్నాయి. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ అలాగే సైరా నరసింహ రెడ్డి చిత్రంలో స్పెషల్ రోల్ చేసింది అనుష్క. అయితే ఇప్పటి వరకు అనుష్క మెయిన్ హీరోయిన్గా మాత్రం నటించలేదు.
ప్రస్తుతం అనుష్క 'నిశబ్ధం' చిత్రంలో నటిస్తుంది ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 2న విడుదల చేయటానికి అన్ని సిద్దం చేసుకున్నారు నిర్మాతలు కనీ.. లాక్ డౌన్ కారణం గా విడుదల వాయిదా పడింది.