నేను చనిపోలేదు : సినీనటి రేఖ
నేను చనిపోలేదు : సినీనటి రేఖ నేను చనిపోలేదు : సినీనటి రేఖ నేను చనిపోలేదు : సినీనటి రేఖ
తాను మరణించినట్టుగా వస్తున్న వార్తలో వాస్తవం లేదని.. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉన్నానని సీనియర్ నటి రేఖ స్పష్టం చేశారు. తాను మరణించినట్టు ఆగస్టు 17వ తేదీ నుంచి సామాజిక మాధ్యమాల్లో వదంతులు పుట్టిస్తున్నారని కొంతమంది పనిలేని వ్యక్తులు యూట్యూబ్ ఛానళ్లను ప్రారంభించి అనవసరమైన అంశాలను ప్రసారం చేసి లబ్ధి పొందుతున్నారన్నారు రేఖ. ఇలాంటి వదంతులు పుట్టిస్తున్న పలు యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారమే. కాగా చంద్రమౌళి దర్శకత్వంలో జీవీ ప్రకాష్, షాలిని పాండే, జయచిత్ర, రేఖ తదితరులు నటించిన తమిళ చిత్రం '100 శతవిదమ్ కాదల్' అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.