మిల్కీ బ్యూటీ తమన్నా'కన్నడ' ఎంట్రీ?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2020-05-03 16:55 GMT
Tamannaah (File Photo)

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా తనేంటో నిరూపించుకుంది ఈ అవంతిక. తాజాగా తమన్నా ఇప్పుడు శాండిల్ వుడ్ లోకి అడుగు పెట్టబోతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచు మనోజ్ నటించిన 'శ్రీ' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది ఈ భామ. దాదాపు 15 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్న తమన్నా తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను తన కథలో వేసుకుంది. సహజం గానే అందంగా ఉండే ఈ భామను 'మిల్కీ బ్యూటీ' అని కూడా పిలుస్తారు.

తనకు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. తమిళ, హిందీ చిత్రాలలో కూడా నటించి వారి మెప్పు పొందింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన 'హిమ్మత్ వాలా ' అనే చిత్రం చేసింది. కమర్షియల్‌ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు, స్పెషల్‌ సాంగ్స్‌.. ఇలా అన్ని రకాల సినిమాలు చేసారు తమన్నా. తాజాగా కథానాయికగా మొదటిసారి ఓ కన్నడ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

యష్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం 'కె.జీ.ఎఫ్‌'లో చేసిన ప్రత్యేక గీతం ద్వారా తొలిసారి కన్నడ తెరపై మెరిశారు తమన్నా. యష్ ‌ హీరోగా నర్తన్‌ అనే కన్నడ దర్శకుడు ఓ ప్యాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ గా తమన్నా పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు తమన్నా ఓకే అంటే కథానాయికగా ఇదే ఆమె చేయబోయే మొదటి కన్నడ సినిమా అవుతుంది.


Tags:    

Similar News