LockDown Effect: మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌

కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ విధితమే.

Update: 2020-03-30 17:04 GMT

కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ విధితమే. బయటకు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు. దీనితో కాలక్షేపం కోసం ప్రజలు ఒకప్పుడు దూరదర్శన్ లో అలరించిన రామాయణ, మహాభారత లను పునప్రసారం చేయాలని కోరడంతో దీనిపైన కేంద్ర సమాచార శాఖ స్పందించి ఓకే చెప్పింది. ఇక ఇలాగే తెలుగు బుల్లితెరపై అందరినీ అలరించిన బిగ్ బాస్ 3 తెలుగు మెమోరీస్ నీ మరోసారి ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా వెల్లడించింది.

21 రోజుల లాక్‌డౌన్‌ సమయంలో ప్రతిఒక్కరు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నట్టు అనుభూతి పొందుతున్నారు. సోమవారం నుంచి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. ఇక అక్కినేికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా, యాంకర్ శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది.


Tags:    

Similar News