అల్లు అర్జున్ అభిమానులకు చేదు వార్త
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అభిమానులకు నిరాశ పరిచే వార్త అందించారు. అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తోన్న అల వైకుంఠపురములో సినిమాలోని మరో పాట టీజర్ విడుదల వాయిదా.
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అభిమానులకు నిరాశ పరిచే వార్త అందించారు. అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తోన్న అల వైకుంఠపురములో సినిమాలోని ''రాములో రాములా'' పాట టీజర్ విడుదల వాయిదా పడింది. ఈ గీతాన్ని సోమవారం విడుదల చేస్తామని బన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పాటను మంగళవారం విడుదల చేస్తామని గీతా ఆర్ట్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్నిదర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే ఈ చిత్రంలోని 'సామజవరగమన'గీతం సినీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో తమన్ అద్భుతమైన బాణీలు ఇచ్చారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ''రాములో రాములా'' పాట టీజర్ను మంగళవారం సాయంత్రం విడుదల చేస్తామని గీతా ఆర్ట్స్ ట్వీట్ లో పేర్కొంది. పాటకోసం అభిమానులు ఎంతగా ఎదురు చూశారో తమకు తెలుసని ఒక రోజు ఆగాలని కోరింది. ప్రేక్షకులకు దిబెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నామని ట్వీట్ లో తెలిపింది. కాబట్టి రాములో రాములో పాట కోసం అభిమానులంతా ఒకరోజు నిరీక్షించక తప్పదు. అభిమానులు మాత్రం ఓపిగ్గా ఎలా ఉండాలో అర్ధం కావడం లేదంటూ ట్వీట్ చేస్తున్నారు.
We strive to give you our best and at times, delays are unavoidable. We know that you've been waiting for the song #RamulooRamulaa, kindly wait for a day more. The song promo will be out tomorrow at 04:05PM, tomorrow. #AlaVaikunthapurramuloo @alluarjun @hegdepooja #Trivikram pic.twitter.com/y2C9ZJGzQH
— Geetha Arts (@GeethaArts) October 21, 2019