ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చైన్నైలోని ఆయన నివాసంలో మరణించారు. తెలుగుతోపాటు పలుబాషల్లో 1700లకు చిత్రాలకుపైగా కొరియోగ్రాఫీ చేశారు. కొరియోగ్రాఫర్గా సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, అప్పటి తరం హీరోలతో కలిసి చేశారు.
కమల్ హాసన్ నటించిన స్వర్ణకమలం లాంటి చిత్రంలో క్లాసిక్ డ్యాన్స్ లు చేశారు. అంతే కాకుండా నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీరామ రాజ్యం చిత్రానికి కూడా ఆయన కొరియోగ్రాఫి చేశారు. పలు చిత్రాలకు నంది అవార్డను సైతం అందుకున్నారు. కాగా...శ్రీను మాస్టర్ స్వస్థలం కర్నూలు జిల్లాలోని ఆదోనిలో పుట్టారు. శ్రీను మాస్టర్ మృతిపట్ల సినీ ప్రముఖలు సంతాపం తెలుపుతున్నారు.