న్యూఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లిన చైసామ్‌

Update: 2020-12-29 16:00 GMT

మూడు రోజుల ముందే న్యూ ఇయర్‌ కోసం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. టాలీవుడ్ సూపర్ జోడీ సమంత, నాగచైతన్య కొత్త సంవత్సర సంబరాల కోసం గోవా వెళ్లారు. వారిద్దరూ హైదరబాద్ ఎయిర్‌పోర్టులోకనిపించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయ్. గత నెలలోనే చైతూ పుట్టినరోజును మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన సామ్ న్యూ ఇయర్ వేడుకలను గోవాలో జరుపుకోవాలని డిసైడ్ అయింది. కాగా చైసామ్‌కు ఇష్టమైన ప్రదేశాల్లో గోవా ఒకటి. 2017లో గోవాలోని ఓ రిసార్ట్‌లోనే వీరి వివాహం జరిగింది. 2017 అక్టోబర్‌ 6న హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ జంట ఏడడుగులు వేయగా.. అక్టోబర్‌ 7న గోవాలో క్రిస్టియన్‌ పద్దతిలో సామంతకు చైతన్య రింగ్‌ తొడిగాడు. 

Tags:    

Similar News