మళ్ళీ రీమేక్ మొదలుపెట్టనున్న మాస్ మహారాజ

Update: 2019-03-11 12:02 GMT

2016 లో కోలివుడ్ హీరో విజయ్ 'తేరి' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. కాప్ డ్రామా గా తెరకెక్కిన అదే సినిమాను ఇప్పుడు తెలుగులో మాస్ మహారాజా రవితేజ రీమేక్ చేస్తున్నట్టు ఎప్పుడో వార్తలు వచ్చాయి. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ముందుగా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేద్దామనుకున్నారు కానీ పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పేయడంతో రవితేజ ను తీసుకున్నారు. రవితేజ ఓకే చెప్పినప్పటికీ, కథలో తెలుగు నేటివిటీకి సరిపోయేలా కొన్ని మార్పులు చేయమని సూచించాడట.

కానీ స్క్రిప్టు ప్రాబ్లమ్స్ వల్ల ఈ సినిమా ను హోల్డ్ లో పెట్టారు. తాజా సమాచారం ప్రకారం రవితేజ ఇప్పుడు మళ్లీ ఈ సినిమాను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. సంతోష్ శ్రీనివాస్ చేసిన మార్పులు రవితేజకు నచ్చడంతో సినిమా లో నటించడానికి మాస్ మహారాజా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ మళ్ళి ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఒకవైపు ఈ సినిమాలో షూటింగ్లో నటిస్తూనే మరోవైపు వి.ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' సినిమా షూటింగ్ కూడా పూర్తి చేయనున్నాడు రవితేజ. ఇక ఈ రెండు సినిమాలు ఇదే ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.

Similar News