రజనీకాంత్కు గాయాలు.. ఆందళనలో అభిమానులు
ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ స్పల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ స్పల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. డిస్కవరీ ఛానల్లో ప్రసారం అయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో రజనీకాంత్ సాహసవీరుడు బేర్ గ్రిల్స్తో కలిసి బంధీపూర్ అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రజనీకి స్పల్ప గాయాలైనట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రజనీకాంత్ సురక్షితంగా ఉన్నారని, ఇంటికి చేరుకున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. బుధవారం చిత్రీకరణ నిరాకరిస్తున్నట్లు ఆటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం కోసం బేర్ గ్రిల్స్ కర్ణాటక కర్ణాటక లోని బందీపూర్ అటవీప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో రజనీకాంత్ , బేర్ గ్రిల్స్ తో కలిసి షూటింగ్ జరపనున్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు ఈ డాక్యుమెంటరీ షూటింగ్ జరుగనుంది. బందీపూర్ అరణ్యంలో అడ్వెంచర్ షుటింగ్ జరుగుతోంది. ప్రతి రోజు ఆరు గంటల పాటు చిత్రీకరణ ఉంటుంది. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిమిషన్ ఇచ్చింది. అయితే అధికారులు పలు నిబంధనలు కూడా విధించారు. 2019లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బేర్ గ్రిల్స్ ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ పార్కులో పలు అడ్వెంచర్ సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే.
మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో బేర్ గ్రిల్స్ అడవుల్లో తిరుగతూ.. నదులు, కొండ ఎక్కుతూ.. సాహసాలు చేస్తుంటాడు. అతను ఎలాంటి ఆహారం సదుపాయాలు లేకపోయినా అడవుల్లో ఎలా బతకగలగాలో తెలుసు వాటిని ప్రజలు చూపిస్తుంటాడు. అందుకే ఈ షోకి ప్రేక్షకన ఆదరణ లభిస్తోంది.