బేర్ గ్రిల్స్తో కలిసి అడవుల్లో తిరగనున్న రజనీకాంత్
రజనీకాంత్ ఈ సారి ఓ పెద్ద సాహసం చేయబోతున్నారు. సాహసవీరుడు బేర్ గ్రిల్స్ తో కలిసి అటవీప్రాంతంలో ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణకు సిద్ధం కానున్నారు.
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది దర్భార్ సినిమాతో సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ ఈ సారి ఓ పెద్ద సాహసం చేయబోతున్నారు. సాహసవీరుడు బేర్ గ్రిల్స్ తో కలిసి అటవీప్రాంతంలో ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణకు సిద్ధం కానున్నారు. డిస్కవరీ ఛానల్లో ప్రసారం అయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం కోసం బేర్ గ్రిల్స్ కర్ణాటక కర్ణాటక చేరుకున్నారు. బందీపూర్ అటవీప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో రజనీకాంత్ , బేర్ గ్రిల్స్ తో కలిసి తిరగనున్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు ఈ డాక్యుమెంటరీ షూటింగ్ జరుగుతుంది. బందీపూర్ అరణ్యంలో అడ్వెంచర్ షుటింగ్ జరుగుతోంది. ప్రతి రోజు ఆరు గంటల పాటు చిత్రీకరణ ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిమిషన్ ఇచ్చింది. అయితే అధికారులు పలు నిబంధనలు కూడా విధించినట్లు తెలుస్తోంది. 2019లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బేర్ గ్రిల్స్ ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ పార్కులో పలు అడ్వెంచర్ సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే.
'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో బేర్ గ్రిల్స్ అడవుల్లో తిరుగతూ.. నదులు, కొండ ఎక్కుతూ.. సాహసాలు చేస్తుంటాడు. అతను ఎలాంటి ఆహారం సదుపాయాలు లేకపోయినా అడవుల్లో ఎలా బతకగలగాలో తెలుసు వాటిని ప్రజలు చూపిస్తుంటాడు. అందుకే ఈ షోకి ప్రేక్షకన ఆదరణ లభిస్తోంది.