దిశ హత్య కేసు: సంచలన ట్వీట్ చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్
దిశ నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
దిశ నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా స్పందించారు. దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నా హీరో సీపీ సజ్జనార్ అని అన్నారు పూనమ్. అయితే మరో సంచలన ట్వీట్ కూడా చేసిందామె.. అందులో
'ఉదయమే మంచి వార్త విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు పలువురి మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నా. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు' అని పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ చేసిన కొద్దీ సేపటికే దాన్ని డిలీట్ చేసింది. అప్పటికే అది వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశయంగా మారింది.