'ఓటర్' గా మళ్ళీ మన ముందుకి రానున్న మంచు విష్ణు

Update: 2019-03-11 09:25 GMT

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న మంచు విష్ణు కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి మళ్ళీ ఇన్నాళ్ళకు 'ఓటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజానికి 2017 లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల అవుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'ఎక్స్ప్రెస్ రాజా' ఫేమ్ సురభి హీరోయిన్ గా నటిస్తోంది. 'మిర్చి' ఫేమ్ సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణ మురళి, ప్రగతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రమోషనల్ పనులు మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను రేపు అనగా మార్చి 12వ తేదీన సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు సమాచారం. సుధీర్ జాన్ పోదుట నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాజేష్ యాదవ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్నికలకు ముందు విడుదలవడం విశేషం. మరి ఈ సినిమాతో అయినా మంచు విష్ణు హిట్ అందుకున్నాడో లేదో వేచి చూడాలి.

Similar News