'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు.

Update: 2019-03-09 12:07 GMT

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రామ్గోపాల్వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న సందర్భంగా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఈ మధ్యనే జరిగింది. ఈ వేడుకకు లక్ష్మీపార్వతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వేడుకలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "నాకు న్యాయం జరుగుతుందని, నా ఆవేదనను ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అని నేను అనుకోలేదు. 23 ఏళ్ల పాటు నాలో నేను ఎంతో ఆవేదనను అనుభవిస్తూ వస్తున్నాను. నాకు నా భర్తకు నాకు జరిగిన అన్యాయాన్ని కడుపులో దాచుకున్నాను. నాకు న్యాయం చేసే వారు ఎవరూ లేరని అనుకున్నాను" అని ఆమె అన్నారు.

"అయితే నేను ఇన్నాళ్లు పడ్డ ఆవేదన రాంగోపాల్ వర్మ అర్థం చేసుకున్నారు. ఈ చిత్రంతో నేను పడ్డ క్షోభను ఆయన బయటకు తెలియజేస్తున్నారు. అసలు నిజాలు బయటకు రాబోతున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది" అని చెప్పుకొచ్చారు లక్ష్మీపార్వతి. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ మరియు లక్ష్మీపార్వతి చుట్టూనే తిరుగుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ చిత్ర ట్రైలర్ ను చూస్తే ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు విలన్ పాత్ర అని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ముఖ్య అంశంగా తీసుకొని వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News